
బుమ్రా, నితీశ్ ఫిట్.. అఫ్ఘాన్ సిరీస్కు పూర్తి బలం
క్రీడలుSaturday, September 12, 20260 views1 min read
గాయాల నుంచి బుమ్రా, నితీశ్ కుమార్, వాషింగ్టన్ సుందర్ కోలుకోవడంతో అఫ్ఘానిస్థాన్తో జరిగే మూడు టీ20ల సిరీస్కు భారత్ బలమైన జట్టుతో బరిలోకి దిగనుంది. హర్షిత్ రాణా మాత్రం గాయం కారణంగా సిరీస్కు దూరమయ్యాడు. మరోవైపు, జెమీమా రోడ్రిగ్స్ స్థానంలో ప్రతికా రావల్కు ఆసియా క్రీడల భారత జట్టులో చోటు లభించింది.
Key Highlights
- • బుమ్రా, నితీశ్ కుమార్ పూర్తిగా ఫిట్.
- • వాషింగ్టన్ సుందర్ ఇప్పటికే ఫిట్నెస్ సాధించాడు.
- • అఫ్ఘానిస్థాన్తో భారత్ మూడు టీ20ల సిరీస్ ఆడనుంది.
- • హర్షిత్ రాణా గాయం కారణంగా సిరీస్కు దూరం.
- • హర్షిత్ స్థానంలో యష్ ఠాకూర్ ఎంపిక.
- • ఆసియా క్రీడల జట్టులో ప్రతికా రావల్కు చోటు.
- • గాయపడిన జెమీమా రోడ్రిగ్స్ స్థానాన్ని ప్రతికా భర్తీ చేయనుంది.
బెంగళూరు: గాయాల నుంచి కీలక ఆటగాళ్లు కోలుకోవడంతో అఫ్ఘానిస్థాన్తో జరిగే మూడు టీ20ల సిరీస్కు భారత జట్టు పూర్తి స్థాయిలో సిద్ధమవుతోంది. ఈ నెల 13 నుంచి ప్రారంభమయ్యే సిరీస్కు పేసర్ జస్ప్రీత్ బుమ్రా, పేస్ ఆల్రౌండర్ నితీశ్ కుమార్ అందుబాటులోకి వచ్చారు. ఇప్పటికే స్పిన్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ ఫిట్నెస్ సాధించగా.. తాజాగా బుమ్రా, నితీశ్ కూడా పూర్తిగా కోలుకున్నట్లు సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్సీ (సీఓఈ) మెడికల్ టీమ్ వెల్లడించింది. వీరిద్దరూ శుక్రవారం జట్టుతో చేరనున్నారు.
అయితే మరో పేసర్ హర్షిత్ రాణా మాత్రం గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో సిరీస్కు దూరమయ్యాడు. అతడి స్థానంలో యష్ ఠాకూర్ను జట్టులోకి ఎంపిక చేశారు.
ఆసియాడ్ జట్టులో ప్రతికా రావల్
న్యూఢిల్లీ: ఆసియా క్రీడల భారత మహిళల జట్టులో టాపార్డర్ బ్యాటర్ ప్రతికా రావల్కు చోటు దక్కింది. ‘ద హండ్రెడ్’ టోర్నీలో గాయపడిన జెమీమా రోడ్రిగ్స్ ఇంకా కోలుకోకపోవడంతో ఆమె స్థానంలో ప్రతికా రావల్ను ఎంపిక చేశారు.

